వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాదయాత్రలో ఒకరోజు విరామం తీసుకున్న చేవెళ్ల పార్లమెంట్ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్ బయలుదేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పూర్తిగా పాడై అద్వాన్న స్థితికి చేరుకున్న గతుకుల రోడ్లతో విసిగిపోయి సామాన్య ప్రయాణికుడిగా జనరల్ బోగీలో బయలుదేరారు.