చేవెళ్ల - Chevella

మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: అమిత్ షా

మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్ సభ సక్సెస్ అయ్యింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఎస్ఏపీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ అమిత్ షా ప్రసంగం సాగింది. ఉమ్మడి ఏపీ ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కొండా వెంకట రంగారెడ్డికి నివాళులర్పించారు. అంతటి ఉన్నత విలువలు గల కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన మనఅభ్యర్థి కొండాను గెలిపించాలని కోరారు. మధ్యాహ్నం 12.05 గంటలకు సభాస్థలికి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసి ప్రసంగాన్ని ప్రారంభించారు. 12.35 గంటలకు సభ ముగిసింది. అంతకుముందు లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గుల్బర్గా ఎంపీ ఉమేశ్ జాదవ్, మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, వీరేందర్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. దేశ అభివృద్ధి, అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. అవినీతి మరక లేని నాయకుడు మోదీ అని అభివర్ణించారు. తెలంగాణకు బీజేపీకి విడదీయరాని అనుబంధనం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. యావత్ దేశం మోదీ వైపు చూస్తోందని, హ్యాట్రిక్ పీఎం కావడం ఖాయమన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా