మంచాల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం పంటల సాగుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మంచాల మండల వ్యవసాయాధికారి జ్యోతి శ్రీ తెలిపారు. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో ఉదయం 9: 00 గంటల నుంచి 10: 30 ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలన్నారు.