కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత

78చూసినవారు
సాగర్ రోడ్డుపై అక్రమంగా తరలిస్తున్న ఆవులను యాచారం పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి సంత నుంచి గురువారం ఇద్దరు వ్యక్తులు 14 పశువులను కొనుగోలు చేసి నగరంలోని కబేళాకు తరలిస్తున్నారు. మార్గమధ్యలో యాచారం పీఎస్ పరిధిలోని మాల్ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేయగా డీసీఎం వాహనంలో పశువులున్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పట్టుకున్న పశువులను నగరంలోని గోశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్