వర్షానికి ఇంటిముందు వచ్చిన చేప పిల్ల

13211చూసినవారు
రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం నుండి కురుస్తున్న వర్షానికి హయత్ నగర్ మునగనూర్ టెలిఫోన్ కాలనీ లో ఇంటి ముందుకొచ్చిన చేప పిల్ల. వివరాల్లోకి వెళితే.. ఉదావత్ లచ్చిరాం నాయక్ తన ఇంటి నుండి పని మీద బయటికి వెళ్ళే సమయంలో తన ఇంటి ముందు పడి ఉన్న చేప పిల్లను చూసి ఆశ్చర్యపోయాడు. చేప పిల్లను ముట్టకొని చూశాక బ్రతికే ఉందని నిర్ధారించుకొని చిన్న చేపను నీళ్లలో ఒక చిన్న బకెట్ లో ఉంచి ఆహారం పెట్టాడు. వర్ష్యంలో చేప పిల్ల పై నుండి పడిందా! లేదా వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందా! అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలో వేయగానే చేప పిల్ల హుషారు గా ఉన్నటు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్