జింకను కాపాడిన స్థానికులు

1910చూసినవారు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని మజీద్‌పూర్ లో గ్రామంలో బుధవారం ఓ జింక దారి తప్పి ఊరిలోకి రావడంతో వీధి కుక్కలు జింకను చంపడానికి వెంబడించాయి. అది గమనించిన గ్రామస్థులు జింక ను ఓ ప్రదేశం లో ఉంచి అటవీ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులు జింకను తీసుకెళ్లి అడవిలో సురక్షితమైన ప్రాంతంలో వదిలేసారు. జింకను కాపాడినందుకు గ్రామస్తులను అధికారులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్