మధురానగర్ పిఎస్ లో పోక్సో కేసు నమోదు

80చూసినవారు
మధురానగర్ పిఎస్ లో పోక్సో కేసు నమోదు
మధురానగర్ కు చెందిన ఒక యువతికి లోకేష్ అనే యువకుడితో స్నేహం కుదిరింది. స్నేహితుడితో ఆ యువతి అన్ని విషయాలు చెప్పేది. ఆ యువతికి సంబంధించిన వీడియోలు, ఛాటింగ్ రికార్డు చేసిన ఆ యువకుడు ఆ యువతి నగ్నంగా వీడియో కాల్ చేయకపోతే బంధువులందరికి పంపుతా అని బెదిరించడంతో తన సోదరుడికి విషయం చెప్పింది. అతను ఫోన్ నెంబర్ మార్చాడు. ఆ యువతి సోషల్ మీడియా వాడుతుంది అని తెలుసుకుని ఫ్రెండ్ గ పరిచయం అయి మల్లి అదే విధంగా వేధించడంతో తన సోదరుడితో కలిసి పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్