వరద కాలువ నిర్మాణానికి చర్యలు: కార్పొరేటర్

594చూసినవారు
వరద కాలువ నిర్మాణానికి చర్యలు: కార్పొరేటర్
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టుకాలనీ, జగదాంబ కాలనీల మీదుగా నిర్మించే వరదనీటి కాలువ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను అధిగమించి త్వరితగతిన పనులు చేపడతామని కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైకోర్టు కాలనీలో వరద కాలువ నిర్మాణం విషయమై టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు, కాలనీవాసులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరద కాలువ నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్