ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మోహన్ నగర్లో మెయిన్ రోడ్డులో కూలి పోయిన మ్యాన్ హొళ్లు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ జలమండలి అధికారులను కోరారు. కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ మెయిన్ రోడ్డుపైన భూగర్భ డ్రైనేజీ ప్రధాన లైన్ మ్యాన్ హొళ్లు మొత్తం కూలిపోవడంతో స్థానికులు కార్పొరేటర్ పవన్ దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం కార్పొరేటర్ అక్కడికి వెళ్లి పరిశీలించారు.