మూసీ నది ఒడ్డున కూల్చివేతలు షురూ

75చూసినవారు
మూసీ నది సుందరీ కరణకు సంబంధించి అధికారులు కూల్చివేత పనులు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే నదీపరీవాహక ప్రాంతం లోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ కూల్చివేస్తోంది. శంకర్ నగర్ లో అధికారు లు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీలను పెట్టి కూల్చివేసే పనిలో పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్