సికింద్రాబాద్ టూ గోవా స్పెషల్ ట్రైన్ ప్రారంభం

64చూసినవారు
సికింద్రాబాద్ టూ గోవా స్పెషల్ ట్రైన్ ప్రారంభం
సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) స్పెషల్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కిషన్ రెడ్డి ఈ రైలును సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు.

సికింద్రాబాద్- గోవా రైలు బుధ, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుంతకల్, బళ్లారి, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇక, గోవా-సికింద్రాబాద్ రైలు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు వాస్కోడగామాలో బయల్దేరుతుంది.

సంబంధిత పోస్ట్