విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతుందని రైతులు రహదారిపై నిరసన తెలిపిన సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో చోటుచేసుకుంది. రాంపూర్, చంద్రధన గ్రామాల మధ్యలో ఉన్న సబ్ స్టేషన్ వెళ్లిన అక్కడ ఎవ్వరు స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సమస్యలు ఉన్నాయని వివరించిన విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.