మంత్రి పొంగులేటికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వినతి

60చూసినవారు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం కలిసి సిద్ధాపూర్ ప్రభుత్వ భూముల వ్యవహారంలో జరిగిన అన్యాయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రభుత్వ భూములను తిరిగి సర్వే చేసి నిజమైన ప్రభుత్వ భూములను నిర్ధారించి ఆ భూములను ప్రజల ఉపయోగ పడేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేస్తూ కోరినట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్