పురపాలక సంఘం పరిపాలన సౌలభ్యం అందరికీ ఉండాలంటే, స్థానిక ప్రజా ప్రతినిధులను. అధికారులను అందరిని నిధుల, విధుల విషయంలో భాగస్వాములను చేయాలని మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.