మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది. హై ప్రొఫైల్ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థిని హాస్టల్లో అత్యాచారానికి గురైంది. మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సదరు బాలిక తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో బాలికకు వైద్య పరీక్షలు చేయగా బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు వార్డెన్ సహా ముగ్గురిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.