మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మీ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ పన్సాల్కర్ డీజీపీగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గతంలో రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినపుడు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు.