వచ్చే అక్టోబర్-నవంబర్ నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు కలిసే పోటీ చేస్తాయని శరద్ పవార్ తెలిపారు. తమకు ఇంకా మూడు నెలల సమయం ఉందని.. సీట్ల కేటాయింపుపై త్వరలోనే చర్చిస్తామన్నారు. ప్రతిపక్ష కూటమికి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు మంచి ఊపును ఇచ్చాయన్నారు.