రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400 పైగా పరుగులు చేసిన చేసిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా 400 రన్స్ను క్రాస్ చేసిన విరాట్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 2011, 2013, 2015, 2016, 2018, 2019, 2020, 2021, 2023, 2024 సీజన్లలో కోహ్లీ 400 పైగా పరుగులు సాధించాడు.