వైసీపీ హయాంలో చైనాకు ఎర్రచందనం దొంగరవాణా చేశారు: చంద్రబాబు

583చూసినవారు
వైసీపీ హయాంలో చైనాకు ఎర్రచందనం దొంగరవాణా చేశారు: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 'వైసీపీ హయాంలో ఎర్రచందనాన్ని దొంగరవాణా చేసి చైనాకు పంపారని అన్నారు. ఎర్రచందనం దొంగరవాణా కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని తగ్గించారని, స్మగ్లర్లను వైఎస్సార్సీపీ నేతలు ప్రోత్సహించారని ఆరోపించారు.' స్మగ్లర్లను ప్రోత్సహించడం సమాజానికి చాలా ప్రమాదమన్న చంద్రబాబు, పల్నాడు జిల్లాలో ఇష్టానుసారం అటవీసంపద కాజేశారని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్