కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక వెల్లడించింది. మనుషుల జీవిత కాలన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది. ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది. 2012లో భారత్లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లుగా ఉండేదని, కరోనా ఎఫెక్ట్తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది.