దేశవ్యాప్తంగా వరి సాగు తగ్గుతుండడంతో దాని ప్రభావం బియ్యం నిల్వలపై పడుతోంది. యాసంగిలో దేశవ్యాప్తంగా సాధారణ వరి సాగు 1,31,25,000 ఎకరాలు కాగా, ఈ ఏడాది సాగు భారీగా తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈ యాసంగిలో 98,22,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయింది. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 33 లక్షల ఎకరాలు తగ్గింది. దీంతో దేశ బియ్యం అవసరాల్లో లోటు ఏర్పడి, జాతీయ స్థాయిలో బియ్యానికి డిమాండ్ పెరుగుతుంది.