చార్‌ధామ్ యాత్రికులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

71చూసినవారు
చార్‌ధామ్ యాత్రికులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చార్‌ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు ఇకపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మొదలైన యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రికి భక్తులు పోటెత్తడంతో రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రలో పాల్గొనేందుకు అనుమతించబోమని తెలియజేస్తూ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలను పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్