వైసీపీ, సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. "జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉంది. తండ్రి లేరు.. బాబాయ్ని చంపారంటూ జగన్ ఓట్లు అడిగారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయవద్దని అతని చెల్లి కోరుతున్నారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా?" అని ఆయన ప్రశ్నించారు.