దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్డేట్స్ కోసం వెబ్సైట్ https://kvsangathan.nic.in/ను సందర్శించండి.