ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ కలకలం!

28570చూసినవారు
ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ కలకలం!
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రిగ్గింగ్ కలకలం రేగింది. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తన అనుచరులతో రిగ్గింగ్ చేయిస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆరోపించారు. రియాసత్ నగర్ డివిజన్ 40వ నంబర్ పోలింగ్ బూత్ లో డోర్లు మూసేసి రిగ్గింగ్ చేస్తున్నారని ఆమె అన్నారు. తనను లోపలికి అనుమతించడం లేదని ఆమె వాపోయారు. బూత్ లోపలికి మొబైల్ ఫోన్లు కూడా తీసుకెళ్లారని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్