రిషభ్ పంత్ ‘బెస్ట్ స్లెడ్జర్‌’: ఆసీస్ క్రికెటర్లు

66చూసినవారు
రిషభ్ పంత్ ‘బెస్ట్ స్లెడ్జర్‌’: ఆసీస్ క్రికెటర్లు
ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ నవంబర్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాలో వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్ ‘బెస్ట్ స్లెడ్జర్‌’ అని ఆసీస్ క్రికెటర్లు ట్రావిస్‌ హెడ్, లబుషేన్, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్‌, హేజిల్ వుడ్ పేర్కొన్నారు. చాలాసార్లు పంత్‌ ఏం చెబుతాడో తమకు అర్థం కాదన్నారు. కానీ, పంత్ చాలా ఫన్నీగా ఉంటాడని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్‌స్పోర్ట్స్‌ ట్విటర్‌‌లో పోస్టు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్