ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన ఓ కుటుంబం అమెరికాలోని పోర్టుల్యాండ్ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కూతురు మృతి చెందగా, తల్లికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. కమతం నరేష్, గీతాంజలి దంపతులు అమెరికాలో పని చేస్తున్నారు. వీరికి 6 ఏళ్ల కుమార్తె హానిక, కుమారుడు ఉన్నారు. గీతాంజలి పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది.