కేరళలోని కుడుక్లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మూల మలుపుల వద్ద అతివేగంతో లారీని ఓవర్ టెక్ చేయబోతుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీ.సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘మూల మలుపుల వద్ద అతివేగంతో భారీ వాహనాలను ఓవర్ టెక్ చేయడం అత్యంత ప్రమాదకరం’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరలవుతోంది.