ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ శర్మ 73 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అతిపెద్ద వయసులో (36 ఏళ్ల 291 రోజులు) సెంచరీ చేసిన భారత్ కెప్టెన్గా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు విజయ్ హజారే (36 ఏళ్ల 278 రోజులు) పేరిట ఉండేది. ఆయన 1951లో ఇంగ్లాండ్పై 155 రన్స్ చేశారు.