'వాట్సాప్'​కు వచ్చిన లింక్ క్లిక్ చేస్తే రూ.13.26 కోట్లు మాయం

76చూసినవారు
'వాట్సాప్'​కు వచ్చిన లింక్ క్లిక్ చేస్తే రూ.13.26 కోట్లు మాయం
హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధుడి నుంచి సైబర్‌ నేరస్థులు ఏకంగా రూ.13.26 కోట్లను కొల్లగొట్టారు. ఒకే బాధితుడు ఇంత స్థాయిలో మోసపోవడం దేశంలోనే ఇదే మొదటిదని పోలీసులు చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగి వాట్సాప్​కు ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ చిట్కాల పేరిట మెసేజ్‌ వచ్చింది. గతంలో షేర్లలో లాభాలు గడించిన అనుభవమున్న ఆయన వారి ఉచ్చులో చిక్కుకొని పై మొత్తం నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్