హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరస్థులు ఏకంగా రూ.13.26 కోట్లను కొల్లగొట్టారు. ఒకే బాధితుడు ఇంత స్థాయిలో మోసపోవడం దేశంలోనే ఇదే మొదటిదని పోలీసులు చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగి వాట్సాప్కు ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరిట మెసేజ్ వచ్చింది. గతంలో షేర్లలో లాభాలు గడించిన అనుభవమున్న ఆయన వారి ఉచ్చులో చిక్కుకొని పై మొత్తం నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించాడు.