తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్కు టీచర్ MLC అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఓటుకు రూ.7 వేలు ఇస్తోందని, పైసల కోసమే LRS పెట్టారని బండి తెలిపారు. రేవంత్ LRS డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజల కోసం కొట్లాడటమే ముఖ్యం అని వెల్లడించారు.