క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రేపు జరగనుంది. ఈ మ్యాచ్పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు. ఈ క్రమంలో యువరాజ్ సింద్ స్పందిస్తూ.. మ్యాచులో రోహిత్ శర్మ 60 బంతుల్లోనే సెంచరీ సాధించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒక్కసారి కుదురుకున్నాడంటే సిక్సర్ల వరద పారిస్తాడని, ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించే ప్లేయర్ అని యువీ వెల్లడించాడు.