AP: ఏలూరుకు చెందిన మోనిక అక్కినేని అబుదాబీలో సెటిల్ అయ్యారు. మోనిక అక్కడే మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతోంది. అయితే ఆమెకు పర్యావరణ పరిరక్షణ మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో గత ఏడాది ఎయిర్ క్వాలిటీ పెంచే డిగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీ పై పరిశోధనలు చేసి.. విజయం సాధించింది. దీంతో యూఏఈ అందించే జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్ను దక్కించుకుంది.