అర్చకులకు జీతం పెంపు.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

1046చూసినవారు
అర్చకులకు జీతం పెంపు.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని సూచించారు. రూ.10 వేలు వేతనం ఇచ్చే అర్చకులకు ఇకపై రూ.15 వేలు, దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచాలని నిర్ణయించారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని, నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్