శబరిమలలో బంగారు లాకెట్‌ల విక్రయాలు ప్రారంభం

65చూసినవారు
శబరిమలలో బంగారు లాకెట్‌ల విక్రయాలు ప్రారంభం
కేరళలోని శబరిమల ఆలయంలో టీడీబీ ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలు మొదలయ్యాయి. విషు పర్వదినం సందర్భంగా కేరళ మంత్రి వీఎన్‌ వాసవన్‌ సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన ఏపీకి చెందిన భక్తుడికి తొలి లాకెట్‌ను అందజేశారు. అయ్యప్ప 2 గ్రాముల లాకెట్‌ ధర రూ.19,300, 4 గ్రాముల లాకెట్‌ ధర రూ.38,600, 8 గ్రాముల లాకెట్‌ ధర రూ.77,200గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్