అమరావతిలోని సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి తాజాగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని తెలిపారు. అలాగే ఐటీడీఏ, ఐసీడీఎస్లు ప్రక్షాళన చేస్తున్నామని, అంగన్వాడీ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గిరిజన స్కూళ్లలో డ్రాప్అవుట్లను నివారిస్తామని తెలిపారు.