AP: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ వైసీపీ కేడర్లో ధైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. ఫలితాలను సమీక్షిస్తూనే పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ MLA, MP అభ్యర్థులతో తన కార్యాలయంలో జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.