జోగిపేట పట్టణంలోని పలు కాలనీలలో పగలే వీధి దీపాలు వెలుగుతున్నాయని స్థానికులు శుక్రవారం తెలిపారు. వీధి దీపాలను ఉదయం సమయంలో అర్పి వేయాల్సిన మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 24 గంటల పాటు వీధి దీపాలు వెలిగితే పాడయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పగటి సమయంలో వీధి దీపాలు వెలగకుండా చూడాలని కోరుతున్నారు.