శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ: మాజీ ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారిని యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగేందర్ రావ్, మండల పార్టీ అధ్యక్షులు విట్టల్ రావు, నాయకులు రాజశేఖర్ రెడ్డి, అమృతరావ్, బాలాజీ రావు, దిలీప్ రావు, గ్రామస్తులు, యూత్ సభ్యులు, తదితరులు ఉన్నారు.