సిర్గాపూర్ మండలం ఉజలంపాడు గ్రామపంచాయతీలోని లక్ష్మణ్ నాయక్ తాండకు చెందిన గంగారం రాథోడ్ అనే రైతు జొన్న పంట గత 2రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు పూర్తిగా నేలకొరిగింది. అప్పులతో పంటలు వేసి అకాల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతిన్నదని నిరుపేద రైతు అయినా గంగారాం కుటుంబంతో పాటు మండల పరిధిలోని రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ శ్రీమతి శోభావతి శేరికార్ మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.