ఎస్జిఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

82చూసినవారు
ఎస్జిఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
సంగారెడ్డి జిల్లా జోగిపేట యన్. టి. ఆర్ మైదానంలో రెండు రోజులుగా జరిగిన మండల స్థాయి ఆటల పోటీల్లో జోగిపేట మైనార్టీ గురుకుల బాలుర విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వీరు త్వరలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయినట్టు మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారాసింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర స్థాయిలలో మంచి ప్రతిభ కనపరచి పాఠశాల పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్