హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

56చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలను కాపాడాలని కోరుతూ హైడ్రా కార్యాలయం బుద్ధభవన్ లో గురువారం సంబంధిత అధికారులకు సంగారెడ్డి జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు రాఘవేంద్ర రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలను కాపాడండి అంటూ హైడ్రా అధికారులకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్