సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించారు. ఉదయం ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించగా మధ్యాహ్నం 7 నుంచి పదవ తరగతి వరకు ప్రవేశపరీక్ష జరగనుంది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో కోలాహలం నెలకొంది.