భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ

79చూసినవారు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎల్లమ్మ ఆలయంలో మహిళా భక్తులు కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాల మొక్కులను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి రైతన్నలు బండ్ల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్