రోడ్డుపై చేరిన వరద నీరు

58చూసినవారు
జిన్నారం మండల శివారులోని దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని సర్వీస్ రోడ్డు పూర్తిగా వరద నీటితో మడుగు తలపిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షంతో రోడ్డుపై వరద నీరు చేరింది. వర్షం కురిసినప్పుడల్లా రోడ్డు పూర్తిగా నిండుకుండల మారుతుందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్