నిప్పుల కొలిమిగా జిన్నారం మండలం

62చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం భగభగ మండుతూ ప్రచండ బానుడు ప్రతాపం చూపించాడు. దీంతో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఎండల దాటికి మండల ప్రజలు రోడ్డుపైకి రావడానికి భయపడుతున్నారు. ఇక వేడిగాలులు సైతం వాహనదారులను ప్రయాణికులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధాన రోడ్లు కాలనీ రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్