ముగిసిన వీరభద్రుడి నవహ్నిక బ్రహ్మోత్సవాలు

83చూసినవారు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి నవహ్నిక బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి, ఏకాంతసేవతో సోమవారం ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు కొనసాగాయి. చివరి రోజున కిరణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్