సంగారెడ్డి మండలం ఈశ్వర పురం లోని సప్త ప్రాకారాయుత దుర్గాభవాని దేవాలయంలో 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు సాంఘిక కుంకుమార్చన లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈనెల 31వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.