లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి

53చూసినవారు
సంగారెడ్డి లోని జిల్లా కోర్టులో సెప్టెంబర్ 28వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ లో ఎక్కువగా క్రిమినల్ కాంపౌండ్ కేసులు పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్