బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితునికి ఉరిశిక్ష

60చూసినవారు
మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన గఫఫార్ కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పి రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023 సంవత్సరంలో బీడీఎల్ స్టేషన్ పరిధిలో 5 సంవత్సరాల బాలికపై గఫఫార్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు చెప్పారు. 11 నెలల్లో కేసును పరిష్కరించి ఉరి శిక్ష పడేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 27 సంవత్సరాల తర్వాత తొలిసారి మరణశిక్ష విధించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్